తన ఫ్లాప్ సినిమాపై స్పందించిన ప్రముఖ డైరెక్టర్..!!

Divya
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందిన కృష్ణవంశీ ఏన్నో చిత్రాలను తెరకెక్కించారు. డైరెక్టర్ తెరకెక్కించిన కొన్ని చిత్రాలలో మంచి పాత్రలు కూడా ఇప్పటికీ గుర్తు ఉంటాయి. ఇక ఈయన కూడా రాంగోపాల్ వర్మ శిష్యుడు అయినప్పటికీ తన గురువు తగ్గట్టుగా ఫ్యామిలీ చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్ళాడుతా, చందమామ, మురారి వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. అయితే శశిరేఖ పరిణయం, మొగుడు వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం పై నెటిజెన్ స్పందించడం జరిగింది. వాటి గురించి చూద్దాం.
శశిరేఖ పరిణయం సినిమా కొంత  బాగానే కలెక్షన్లను రాబట్టింది కానీ గోపీచంద్ హీరోగా నటించిన మొగుడు చిత్రం మాత్రం బాక్సాఫీసు దగ్గర దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. గోపీచంద్ సరసన తాప్సీ నటించింది. ఇందులో రాజేంద్రప్రసాద్ రోజా వంటి స్టార్స్ కూడా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలోని ఒక సీన్ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ట్రొల్  చేయడం జరుగుతోంది. ఈ సన్నివేశంలో రోజా ఒకరి పై చేయి చేసుకుంటుంది ఆ తరువాత నటుడు రాజేంద్రప్రసాద్ తన అల్లుడు పై చేయి చేసుకోవడం రోజాని ఛార్జింగ్ కొట్టడం ఎలా గోపీచంద్ తాప్సీ కొట్టడం.

ఇలాంటి సన్నివేశాన్ని కృష్ణవంశీ ఎలా తీశారు అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో నేను చాలానే ఉంటాయి.. కానీ ఈ సన్నివేశాన్ని ఒక నెటిజన్ షేర్ చెస్తు.. ఈ సన్నివేశానికి థియేటర్లలో నవ్వే నవ్వులు ఎలా తీశావు స్వామి ఈ కళాఖండాన్ని అంటూ డైరెక్టర్ కృష్ణ వంశీని ట్యాగ్ చేయడం జరిగింది. అయితే దీనిపై స్పందించిన కృష్ణవంశీ కథ ఏంటో స్వామి థ్యాంక్యూ గాడ్ బ్లెస్ అని తెలియజేశాడు. ప్రస్తుతం కృష్ణవంశీ మాత్రం రంగమార్తాండ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రమైన ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: