బాలీవుడ్ లో ప్రేమించి వివాహం చేసుకున్న వారు ఎంతమందో తెలుసా..?

Divya
బాలీవుడ్ వెండితెరపై.. ప్రేమ కథలు అంటే ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అదే తరహాలో రియల్ లైఫ్లో కూడా నటీనటులు ప్రేమించుకొని ఒక్కటై తన అభిమానులను ఆనందపరుస్తూ ఉంటారు. ఇక ప్రేమించుకుంటున్నప్పుడు ఏదైనా ఒక చిన్న అప్డేట్ వచ్చినా కూడా వాటి గురించి చాలా వైరల్ గా చేస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఇప్పుడు బాలీవుడ్లో అలా ఎంతమంది ప్రేమించి వివాహం చేసుకున్నారో తెలుసుకుందాం.

బాలీవుడ్లో సునీలల్ దత్-నర్గీస్ నుంచి ఆలియా భట్-రణబీర్ కపూర్ వరకు చాలామంది ప్రేమించి వివాహం చేసుకున్న వారే.. ఇక వీరితో పాటుగా రన్ విర్ సింగ్-దీపికా పడుకొనే, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్.. ఇలా ఎంతోమంది ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల కి వివాహం చేసుకున్నారు. సంజయ్ దత్ వాళ్ళ అమ్మ నర్గీస్  పంజాబీ ముస్లిం.. ప్రాంతానికి చెందిన వారు.. ఇక సునీల్ దత్ మాత్రం బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకోవడంతో బాలీవుడ్లో వీర ప్రేమ కథ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు.

ఇక మోడ్రన్ ప్రేమజంటలు గా పేరుపొందిన వారు ఎవరిదంటే.. రన్ విర్ సింగ్-దీపిక, అనుష్క శర్మ -విరాట్ కోహ్లీ, రన్ బీర్ కపూర్-ఆలియా భట్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంటలు బాగా వార్తల్లో నిలిచాయి.. వీటితో పాటుగా ఎంతోమంది బాలీవుడ్లో ప్రేమించుకోని వార్తల్లో నిలిచినప్పటికీ వివాహం చేసుకోలేదు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్- ఐశ్వర్యారాయ్ గతంలో వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత కత్రినా కైఫ్ తో ప్రేమలో పడ్డాడు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే కొంతమంది వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయారు. అలాంటి వారిలో అర్భాజ్ ఖాన్ - మలైకా అరోర ,అమీర్ ఖాన్ - కిరణ్ రావు ,హృతిక్ రోషన్ - సుసన్నే ఖాన్. మిగిలిన వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: