పవర్ స్టార్తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ప్లాన్.. ఇది జరిగే పనేనా..?
ఇటీవల విడుదలైన కేజీఎఫ్-2 సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. దర్శకుడు ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, కేజీఎఫ్-2లో తన పనితనం చూపించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యశ్ నటించారు. ఈ సినిమాల ద్వారానే యశ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. భారీ విజయం అందుకున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మార్మోగుతోంది. ఇప్పుడు తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. తన పవర్ హౌజ్ స్టామినాతో బాక్సాఫీస్ని షేక్ చేస్తాడని అందరి నమ్మకం. ఇప్పటికే కేజీఎఫ్లో కన్నడ స్టార్ హీరో యశ్ను డిఫరెంట్ యాంగిల్లో చూపించిన ప్రశాంత్ నీల్.. ఒకవేళ పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే ఆ లెక్కలు వేరేలా ఉంటాయని చెప్పవచ్చు. అయితే టాలీవుడ్ వర్గంలో అసలు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్సులు ఉన్నాయా..? ఒక వేళ వచ్చినా సినిమా సెట్ అవుతుందా అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు.
కాగా, ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రెబల్ స్టార్ ప్రభాస్తో కలిసి ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మరో కన్నడ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి సినిమా చేసే ఆలోచన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్తో కలిసి సినిమా చేయడం తన కోరిక అని, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండంటే ఏ రేంజ్లో ఉంటుందనే విషయంపై అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్నారు.