రణబీర్-అలియా పెళ్లి బహుమతులు చూస్తే షాకవ్వాల్సిందే!

Purushottham Vinay
ఇటీవలే రణబీర్ కపూర్-అలియా భట్ లు తమ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. 6 అంతస్తుల వాస్తు భవంతిలో అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. సంగీత్,మెహందీ ఇంకా అలాగే వివాహ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి.మరి ఈ జంటకు ఎవరెవరు ఎలాంటి గిఫ్ట్ లు పంపించారో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. ఈ కొత్త జంటకి ఖరీదైన బహుమానలు పంపించి వారిని ఫుల్ ఫిదా చేసారు. ఇక ఓసారి ఆ వివరాల్లోకి కనుక వెళ్తే...బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రణ్ బీర్ కపూర్ మాజీ ప్రేయసి కత్రినా కైప్ 14.5 లక్షల విలువ గల ప్లాటినం బ్రేస్ లేట్ ఇద్దరికీ గిప్ట్ గా ఇచ్చింది. రణబీర్-కత్రినా కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ రకంగా రణబీర్ అభిరుచులు ఎలా ఉంటాయన్నది కత్రినా కైఫ్ కి బాగా ఐడియా ఉంది. ఇక మరో ప్రేయసి దీపికా పదుకొణే విడివిడిగా విలాస వంతమైన వాచ్ లని పంపింది. దీపిక తోనూ రణబీర్ కూడా కొన్నాళ్ల పాటు ఘాడమైన ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.పెళ్లి దాకా వచ్చి వెళ్లి వెనక్కి వచ్చారు. ఇక అలియాభట్ ఫ్రెండ్ సిద్దార్ధ్ మల్హోత్రా మూడు లక్షల విలువగల లగ్గరీ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు.


అలాగే మరో ఫ్రెండ్ వరుణ్ ధావన్ మాత్రం నాలుగు లక్షల ఖరీదు గల గూచీ సాండల్స్ ఇచ్చాడు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమాతో వరుణ్ ఇంకా సిద్ధార్ధ్ రంగ ప్రవేశం చేసారు. అదే సినిమాతో అలియా భట్ కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సమయంలోనే వీరు ముగ్గురు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఎనర్జెటిక్ రణవీర్ సింగ్ మాత్రం రణబీర్ కపూర్ కి బైక్ ని గిప్ట్ గా ఇచ్చాడు. ఇది మంచి లగ్జరీ బైక్ . దీని ధర కూడా అధికంగానే ఉంటుంది. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తొమ్మిది లక్షల విలువగల డైమండ్ నెక్లెస్ ని అలియా భట్ కి బహుమతిగా ఇచ్చింది. అలాగే కరీనా కపూర్ మూడు లక్షల విలువ గల మరో నెక్లెస్ ని అందించింది.ఇక రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్ 26 కోట్ల ఖరీదుగల జేసే ప్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.ఇక ఈ ప్లాట్ ప్రస్తుతానికి కొత్త కాపురానికి పనికొస్తుంది.రణబీర్ కపూర్ తండ్రి రిషీకపూర్ ఇంట్లోనే ఈ జంట కాపురం చేయాల్సి ఉంది. అయితే ఆ ఇల్లుని రీమోడల్ చేస్తున్నారు. కారణంగా నీతుకపూర్ గిఫ్ట్ ఇచ్చిన ప్లాట్లో నే ఈ జంట కొన్నాళ్లు కాపురం చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: