బీస్ట్' సినిమా చూసేవారికి అదిరిపోయే ఆఫర్..
తమిళ తంబీలకు విజయ్ సినిమాలు వస్తున్నాయి అంటే హంగామా మాములుగా ఉండదని తెలిసిందే.ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానులు సినిమా చూడటానికి లైన్లలో నించున్నారు. తమిళనాడులో బీస్ట్ సినిమా చూసిన వారికి అదిరిపొయె ఒక ఆఫర్ ను ప్రకటించారు.. దాంతో జనం ఎప్పటి నుంచో సినిమా టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న ధరలతో సథమథమవుథున్నా జనాలకు ఆ అఫర్లు బాగా నచ్చాయి. ఇప్పుడు థియెటర్లు కిట కిట లాడుతున్నాయి.
విషయాన్నికొస్తే..చెన్నైలోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు బీస్ట్ సినిమా చూసిన వారికి ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఓ కండిషన్ కూడా పెట్టారు. కాగా, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ఈ థియేటర్లో ఫస్ట్ షోను ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. ఈ థియేటర్స్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ధర 500 ఉంది. ఈ రేటుతో కనీసం అయిదు టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. విజయ్ స్టార్ హీరో అవ్వడం వల్ల టికెట్లు అయ్యిపొయాయి..ఆ ఆఫర్ వల్ల సినిమా క్రేజ్ మరింత పెరిగింది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..