బిగ్ బాస్ రియాల్టీ షో కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బిగ్ బాస్ రియాల్టీ షో మొదట ఇండియా లో హిందీ లో ప్రారంభం అయ్యింది. హిందీ లో ప్రారంభం అయిన బిగ్ బాస్ రియాల్టీ షో కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో బిగ్ బాస్ రియాలిటీ షో లను దేశవ్యాప్తంగా ఎన్నో భాషలలో మొదలుపెట్టారు, అందులో భాగంగా ఇప్పటికే తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో విజయవంతంగా అయిదు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ 'ఓ టి టి' నాన్ స్టాప్ ను తెలుగు లో ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' నాన్ స్టాఫ్ కూడా విజయవంతంగా రన్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ 'ఓ టి టి' నాన్ స్టాప్ షో వీకెండ్ కు రెడీ అయ్యింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కంటే ముందు వరస్ట్ పర్ఫామర్ ను ఎన్నుకోవాల్సిన టైమ్ వచ్చేసింది, దీంతో మెజారిటీ హౌస్ సభ్యులు బిందు మాధవి పేరును తెలియజేసినట్లు తెలుస్తోంది. గేమ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాయిన్స్ పోగొట్టుకుందంటూ చాలా మంది బిందు మాధవి ని చెత్త ప్లేయర్ గా అభిప్రాయపడ్డారు, చివరికి బిందు మాధవి ఫ్రెండ్ యాంకర్ శివ కూడా కాయిన్స్ పోగొట్టుకోవడం తప్పంటూ బిందు మాధవి కి వరస్ట్ పర్ఫామర్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో బిందు మాధవి తన గేమ్ ని తప్పు పట్టిన ఇంటి సభ్యుల తీరును తిప్పికొట్టే ప్రయత్నం చేసింది, దీనితో అఖిల్, బిందుమాధవి కి మధ్య మరో సారి గొడవ జరిగింది , ఈ వారం బిందు మాధవి వరస్ట్ పర్ఫామర్గా ఎంపికై జైల్లో పడ్డట్లు కనిపిస్తోంది.