ఆ స్టార్ హీరోలకు బ్యాడ్ టైం స్టార్ట్.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..!!

N.ANJI

ఈ రోజుల్లో జాతకాలు నమ్ముతారా అంటే అవుననే చెప్పాలి. కొందరు జ్యోతిష్యులు చెప్పిన మాటలు నిజం అవ్వడం.. సెలబ్రిటీలు సైతం వారి మాటలు నమ్మడం ప్రారంభించారు. అయితే చాలా వరకు టీవీ షోలల్లో ఈ రాయి, ఈ ఉంగరం పెట్టుకోండి.. మీ లైఫ్ మారిపోతుంది. మీరు కోటీశ్వరులు అవుతారని చెబుతుంటారు. దీంతో ప్రజలు వారి మాటలు నమ్మి అప్పు చేసి మరీ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే అదృష్టం బాగుంటే కొందరు కోటీశ్వరు అవుతారు. మరికొందరు మోసపోతుంటారు.



అలాంటి వారిలో జ్యోతిష్యులు వేణుస్వామీ కూడా ఒకరు. ఇప్పటివరకు ఆయన చెప్పింది చెప్పినట్లు జరిగిపోయాయి. అందుకే ఆయన మాటలు అందరూ ఎక్కువగా నమ్ముతుంటారు. దానికి ప్రత్యేక ఉదాహరణ సమంత-నాగచైతన్య విడాకులు. వీరి పెళ్లి కాకముందే వేణుస్వామీ వాళ్లు కలిసి ఉండరని పేర్కొన్నారు. వాళ్ల జాతకాలు కలవలేవని, రాసిపెట్టుకోండని, వాళ్లు విడిపోతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. షాకింగ్ ఏంటంటే ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయి. సమంత- నాగ చైతన్య విడిపోవడంతో ఆయన పేరు మార్మోగింది. దీంతో ఆయన ఫేమస్ అయ్యారు.


కాగా, తాజాగా ఆయన మరోసారి ఇండస్ట్రీలో ప్రముఖుల జాతకాలు చెబుతూ హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి చెబుతూ.. ఆయనకు తిరుగులేదని, రాబోయే ఐదేళ్ల వరకు అల్లుఅర్జున్‌కు తిరుగులేదని చెప్పాడు. అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా రూ.200 కోట్లు కలెక్షన్స్ రావడం ఖాయం అన్నారు. అలాగే ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ల గురించి పేర్కొన్నారు. సమంత, పూజా హెగ్డే, రష్మిక కొన్ని సంవత్సరాలకు సినీ ఇండస్ట్రీనే ఏలేస్తారని చెప్పారు. అలాగే ఇద్దరు బడా స్టార్ హీరోలకు మాత్రం బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఆ ఇద్దరూ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతారని, వాళ్లు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాలు కూడా క్యాన్సల్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరనే విషయం వెల్లడించలేదు. దీంతో నెటిజన్లు ఆ స్టార్ హీరోలు ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: