యంగ్ హీరో శర్వానంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్ ఆ తర్వాత కాలంలో హీరోగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శర్వానంద్ గత కొంత కాలంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాలను ఎదుర్కొంటున్నాడు, పడి పడి లేచే మనసు, రణరంగం, జాను , శ్రీకారం, మహా సముద్రం లాంటి వరుస పరాజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ డీలా పడిపోయి ఉన్నాడు.
అలాంటి సమయం లోనే శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో హీరోగా నటించాడు, ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా శర్వానంద్ విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వస్తాడు అని చాలా మంది భావించారు. కాకపోతే ఈ సినిమా కూడా శర్వానంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది, ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన శర్వానంద్ ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే శర్వానంద్ మరో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిబోతున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో శర్వానంద్ ఒక బిడ్డకు తండ్రి పాత్రలో కనిపించబోతుంట్లు తెలుస్తుంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.