టీవీ: జబర్దస్త్ కమెడియన్ల కు షాకిచ్చిన మల్లెమాల..!!

Divya
బుల్లితెరపై ఎన్నో కామెడీ షో లు ఉన్నప్పటికీ జబర్దస్త్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం, రేటింగ్ ఉందని చెప్పవచ్చు.. ఇక ఈ షో లో ఉండే కంటెస్టెంట్స్ ను ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు.. ఈ జబర్దస్త్ షోలో హైలెట్గా యాంకర్స్, కంటెస్టెంట్ ల పంచులు, జడ్జిలు వేసే పంచ్ డైలాగులు బాగా హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ షో టిఆర్పి రేటింగ్ కాస్త డౌన్ అయిందని చెప్పవచ్చు. అందుకు కారణం కంటెస్టెంట్ లో పంచ్ డైలాగులు సరిగా లేకపోవడమే అన్నట్లుగా మళ్ళీ మన సంస్థ తెలియజేసినట్లు సమాచారం. అందుచేతనే మల్లెమాల సంస్థ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
జబర్దస్త్ లో పాల్గొని కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ విషయంలో కోత విధించినట్లు గా సమాచారం. ఫలితంగా అందులో ఉండే కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.. అయితే రేటింగ్ పరంగా పెరిగినట్లు అయితే వీరి యొక్క రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో రోజా మినహా మిగిలిన అందరి రెమ్యూనరేషన్లు కోత విధించి నట్లుగా సమాచారం. ఇక ఇందులో పాల్గొన్న ఎంతోమంది కంటెస్టెంట్ లు, యాంకర్ల సైతం సినిమాలలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం జడ్జి రోజా మాత్రం ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షలు తీసుకుంటోందట. ఇక మరొక జడ్జి మనో మాత్రం 2 లక్షలు ఒక్కో ఎపిసోడ్ కి అందుకుంటున్నారు. ఇక యాంకర్ రష్మి అనసూయ లు మాత్రం 1.50 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక సుధీర్ టీమ్ కు మాత్రం 3 లక్షలు.. హైపర్ ఆది టీమ్ 2.5 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మిగిలిన కంటి స్టెంట్లలలో అందరికీ 2 లక్షల రూపాయల కంటే తక్కువగా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కొంతమంది ఈ షో ని విడి ఇతర వాటిలోకి వెళుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: