ఆ సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

N.ANJI
నందమూరి బాలకృష్ణ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పౌరాణికంగా, యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో ఒక్కరిగా రాణిస్తున్నారు. అయితే బాలయ్య లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, ఇండస్ట్రీ హిట్ గా నిల్చిపోయారనే చెప్పాలి మరి.
అయితే నందమూరి బాలయ్య సరసన సిమ్రాన్, అంజలా జవేరీ నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా 1999 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాలయ్య ఫాన్స్ నే కాదు, జనానికి కూడా బాగా కనెక్ట్ అయిందనే చెప్పాలి మరి. అప్పట్లో ఆరు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ అనూహ్యంగా 16 కోట్లు వసూలు చేసిందని సమాచారం.
అంతేకాదు.. ఈ సినిమా 122 కేంద్రాలలో 50 రోజులు, 32 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక ఈ చిత్రం 29 కేంద్రాలలో 175 రోజులు, 3 థియేటర్లలో 227 రోజులు ఆడిందనే చెప్పాలి మరి. కాగా.. ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా బి గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా  రాశి, సంఘవి, అంజలా జవేరిలని అనుకున్నారంట.
ఇక రాశి సినిమాలోని సీతాకోకచిలుక సన్నివేశానికి నో చెప్పడంతో ఆమె ప్లేస్ లో సిమ్రాన్ సెలెక్ట్ చేశారని తెలిపారు. అలాగే సిందూరపువ్వు తమిళ మూవీ మెయిన్ కథని తీసుకొని, కొన్ని మార్పులు చేసి సమరసింహారెడ్డి సినిమా కథ విజయేంద్ర ప్రసాద్ రాసుకోగా, అయన దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహాతో రాయలసీమ ఫాక్షన్ ని జత చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక..  సమరసింహారెడ్డి మూవీ వచ్చి 23ఏళ్ళు అయిందని తెలిపారు. అయితే బాలయ్య, మణిశర్మ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: