బిగ్ బాస్ హౌస్ కి అస్సలు వెళ్ళనంటున్న పూనమ్ పాండే...!

murali krishna
బోల్డ్ పోజులతో అలాగే బోల్డ్ కామెంట్స్ తో పూనమ్ పాండే ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటారు. వివాదాస్పద నటిగా ఉండాల్సినంత పేరుందట ఈమెకు. అలాగే ఈమె చర్యలపై నెటిజెన్స్ ఎప్పుడూ విరుచుకుపడుతూ ఉంటారు

సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా పూనమ్ బిగ్ బాస్ షో గురించి కొన్ని కామెంట్స్ చేశారట.మీరు బిగ్ బాస్ షోకి వెళతారా? ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే నాకు భయం అని అన్నారట.

నాకు తినడం అంటే చాలా ఇష్టం. కానీ బిగ్ బాస్ షోలో కడుపునిండా తినడానికి కూడా అస్సలు కుదరదు. ఒక్కోసారి అసలు ఏమీ తినకుండా కంటెస్టెంట్స్ కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అది నావల్ల కాదు. నేను బిగ్ బాస్ షోని ఎంతగానో ఇష్టపడతాను కానీ అయితే నేను మాత్రం పాల్గొనలేను అని తన అభిప్రాయం వెల్లడించారట.. అలాగే అనేక సార్లు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి పిలుపు కూడా వచ్చింది, కానీ ఆసక్తి లేకపోవడంతో నేను వెళ్ళలేదన్నారట.. ఇక ఏమాత్రం సందు దొరికినా కూడా పూనమ్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉండే నెటిజెన్స్ ఈ విషయంలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఇక పోర్నోగ్రఫీ కేసులో ఆమెకు ఊరట కూడా లభించింది. ముంబై హై కోర్ట్ ఆమె ముందస్తు బెయిలు రద్దు చేస్తూ తీర్పు ఇవ్వగా సుప్రీం కోర్ట్ లో ఆమెకు ముందస్తు బెయిల్ ని సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందట.. దీంతో ఆమె అరెస్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.

కాగా పూనమ్ పాండే వైవాహిక జీవితంలో కూడా అన్నీ వివాదాలే ఉన్నాయి . ఆమె 2020 సెప్టెంబర్ 1న బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ప్రేమ వివాహం చేసుకున్నారుట.. పెళ్ళైన 10 రోజులకే గోవాలో సామ్ బాంబే మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిందని.పూనమ్ కంప్లైంట్ ఆధారంగా సామ్ బాంబేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారట.. మరలా కాంప్రమైజ్ అయిన ఈ జంట కలిసి ఉంటున్నట్లు సమాచారం.ఇద్దరూ గొడవపడటం మరియి కలిసిపోవడం కామనైపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: