దయచేసి ట్రోల్ చేయొద్దని వేడుకుంటున్న అనీ మాస్టర్..,!

murali krishna
తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు.ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో ముగిసిన సంగతి మనందరికి తెలిసిందే.

బిగ్ బాస్ షో ముగిసిన కూడా కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ ల మధ్య జరిగిన వివాదాలను అభిమానులు తవ్వుతూనే ఉన్నారు.. అయితే హౌస్ లో ఎన్ని గొడవలు పడిన కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్ లు అందరూ కలిసి మెలిసి ఉంటారు. కానీ వారి అభిమానులు మాత్రం ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసుకుంటూనే వున్నారు.

తాజాగా అనీ మాస్టర్ తన ఫ్యాన్ వార్ ట్రోలింగ్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంక్రాంతి పండుగ కోసం స్టార్ మా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ పాల్గొంటున్నారు.ఈక్రమంలో సన్నీ మరియు మానస్ ఇద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు స్టెప్పులు వేశారు. దీంతో సన్నీ మానస్ అభిమానులు తెగ సందడి చేస్తూ వచ్చారట . మానస్, సన్నీలను కలిసి మన్‌సూన్ అంటూ ఓ కొత్త హ్యాష్ ట్యాగ్‌తో దుమ్ములేపుతున్నారట. వీటిపై శ్రీరామచంద్ర ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ మీద మానస్, సన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇక వెంటనే సన్నీ, మానస్ ల అభిమానులు ఆ ట్రోలింగ్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

  ఎవరిని ఇలా పర్సనల్ గా తిట్టవద్దు ఇలాంటి ట్రోలింగ్స్ అస్సలు వద్దు అని అంటారు మళ్లీ మీరే స్టార్ట్ చేస్తారు.. మేము ట్రోల్స్ చేస్తే మా మీద పడి ఏడుస్తారు అంటూ సన్నీ మరియు మానస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని తెలుస్తుంది.ఈ విషయంపై అనీ మాస్టర్ రంగంలోకి దిగారట.ప్లీజ్ దయచేసి ఇలాంటి ట్రోలింగ్ నీ ఆపేయండి. నేను ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రోలింగ్ నీ అస్సలు ఎంకరేజ్ చేయను.. నా మీద కాని ఇతర కంటెస్టెంట్ ల మీద గానీ ఇలాంటి ట్రోల్స్ చేయకండి అంటూ అనీ మాస్టర్ వేడుకున్నారట.. మరి అనీ మాస్టర్ కోరిక మేరకు అభిమానులు ట్రోలింగ్స్ ని ఆపుతారా లేదా అన్నది తెలియాలి అంటే వేచిచూడాల్సిందేగా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: