చ‌ర‌ణ్ చెంప పగ‌ల‌గొట్టిన చిరంజీవి.. కార‌ణం ఆ హీరోయిన్‌నే?!

VUYYURU SUBHASH
మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌దైన టాలెంట్‌తో మెగా ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి విశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం హీరోగా ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నాడు. అటువంటి కొడుకు చెంప ప‌గ‌ల‌గొట్టాడ‌ట చిరంజీవి. అస‌లు చ‌ర‌ణ్‌ను చిరు ఎందుకు కొట్టాడు..? అన్న‌ది తెలియాలంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.
రామ్ చ‌ర‌ణ్ డ‌బ్యూ చిత్రం `చిరుత‌`. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా నేహా శర్మ న‌టించింది. 2007 సెప్టెంబరు 28న గ్రాండ్‌గా విడుద‌లైన ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్ వ‌సూల్ చేసి సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

పూరి పంచ్ డైలాగులు, చరణ్ డాన్స్ తో పాటుగా మ‌ణిశ‌ర్మ అందించిన‌ సంగీతం, హీరో-హీరోయిన్‌ల‌ కెమిస్ట్రీ ప్రేక్షకుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. చిరుత‌ సినిమా విడుద‌లైన త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, నేహా శ‌ర్మ‌ల గురించి ర‌క‌ర‌కాలుగా క‌థ‌నాలు తెర‌పైకి వ‌చ్చాయి. చ‌ర‌ణ్‌, నేహాలు ప్రేమలో ప‌డ్డార‌ని.. ఈ విష‌యం తెలుసుకున్న చిరంజీవి చెంప ప‌గ‌ల‌గొట్టి మ‌రీ కొడుక్కి ప్రేమ వ్య‌వ‌హారాలు మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాదు గానీ.. చిరుత త‌ర్వాత నేహా శ‌ర్మ మాత్రం పెద్ద‌గా టాలీవుడ్‌లో కనిపించ‌లేదు.
కాగా, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)` సినిమా చేశాడు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించారు. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్‌తో, 16వ చిత్రాన్ని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: