దండాలయ్యా : మాకు కల్ట్ క్లాసిక్ లు వద్దంటున్న మహేష్ ఫ్యాన్స్ .... ??

GVK Writings
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తం రెండు సినిమాలు తీశారు. మొదట మహేష్ తో అతడు మూవీ తీసిన త్రివిక్రమ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. జయభేరి సంస్థపై మురళి మోహన్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేసారు. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా టివిలో ప్రసారం అవుతూ మంచి రేటింగ్స్ అందుకుంటూ ఉండడం విశేషం. అనంతరం మహేష్, అనుష్కల కలయికలో ఖలేజా మూవీ తీసిన త్రివిక్రమ్ దానితో భారీ పరాజయాన్ని చవిచూశారు. అప్పట్లో ఎంతో భారీగా తెరకెక్కిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ కూడా ఇప్పటికీ బుల్లితెర ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ అందుకుంటూ ఉండడం విశేషం. ఇక మళ్ళి త్వరలో పన్నెండేళ్ల అనంతరం మహేష్ తో త్రివిక్రమ్ వర్క్ చేయనున్నారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమా ప్రారంభానికి ముందే పలువురు మహేష్ ఫ్యాన్స్ దర్శకుడు త్రివిక్రమ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి అతడు మంచి విజయం అందుకున్నప్పటికీ ఖలేజా మాత్రం ఫ్లాప్ అయిందని, అయితే ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ మూవీ ప్రస్తుతం టివిలో ప్రసారం అవుతూ మంచి క్రేజ్, రేటింగ్స్ అందుకోవడం బాగున్నప్పటికీ, తమ హీరోతో త్రివిక్రమ్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ తీయాలని కోరుతున్నాం తప్ప ఇలా రిలీజ్ తరువాత ప్లాప్ అయి, అనంతరం టివి ఆడియన్స్ ని మెప్పించే కల్ట్ క్లాసిక్స్ తమకు వద్దంటే వద్దని ఆయనని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు యావత్ టాలీవుడ్ ఆడియన్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఎంతో భారీ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ తో తాను చేస్తున్న మూవీ కావడంతో దీనిని ఎలాగైనా అతి పెద్ద సక్సెస్ చేసేలా త్రివిక్రమ్ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ విషయమై ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయి, రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా భారీ సక్సెస్ కొడితే మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: