అతనికి టార్గెట్ ఫిక్స్ చేసిన మెగాస్టార్..!

shami
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో చేసిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 4న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఆచార్య ఆరోజున వస్తాడు. ఒకవేళ పరిస్థితి బాగలేకపోతే మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా డైఅక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వి ప్రసాద్, కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబందించి ఇప్పటివరకు 45 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయినట్టు తెలుస్తుంది. అయితే మళ్లీ కరోనా ఉదృతి పెరిగితే షూటింగ్ కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. అందుకే డైరక్టర్ మోహన్ రాజాకి మెగాస్టార్ చిరంజీవి సినిమాను 60 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. 60 రోజుల్లో సినిమా పూర్తి చేసేలా పర్ఫెక్ట్ గా షెడ్యూల్ ని సిద్ధం చేయమని. తన కాల్ షీట్స్ కూడా అందుకు ఇస్తానని చెప్పారట మెగాస్టార్.
గాడ్ ఫాదర్ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చిరు సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సల్మాన్ ఈ సినిమా కోసం 15 రోజులు డేట్స్ ఇస్తున్నట్టు టాక్. సో మొత్తానికి మెగా మూవీ గాడ్ ఫాదర్ అనుకున్న విధంగా 60 రోజుల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శనర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలు లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: