ఉప్పెన తో కలెక్షన్స్ ఉప్పెన ..... !!

GVK Writings
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ఉప్పెన. కొత్త నటి కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ప్రముఖ కోలీవుడ్ ఆక్టర్ విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. ఇక అంతకముందు యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా సాంగ్స్ అందరి నుండి విశేషమైన స్పందన అందుకొవడంతో పాటు ముఖ్యంగా నీకన్ను నీలి సముద్రం సాంగ్ అయితే ఏకంగా వందల మిలియన్స్ వ్యూస్ అందుకుని ఉప్పెన మూవీ పై అందరిలో విపరీతమైన అంచనాలు పెంచింది.
అనంతరం కొన్నాళ్ళకు రిలీజ్ అయిన ఈ సినిమా అందరి అంచనాలు అందుకుని ఓవరాల్ గా దాదాపుగా రూ. 50 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా లవ్ కం ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బుచ్చిబాబు సన ఉప్పెన సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అనే చెప్పాలి. ఇక తొలి చిత్రం అయినప్పటికీ కూడా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించడం, అలానే సినిమాకి దేవిశ్రీ అందించిన సాంగ్స్ తో పాటు బీజీఎమ్ కూడా ఎంతో పెద్ద ప్లస్ అయింది.
ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానం మొదట్లో తమకు కలిగిందని, అయితే కథ ప్రకారం క్లైమాక్స్ అలా ఉంటేనే కరెక్ట్ అని భావించిన తామందరి అభిప్రాయాన్ని ప్రేక్షకాభిమానులు అందరూ నిజం చేసి మాకు సూపర్ హిట్ ని అందించడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు నవీన్, రవిశంకర్ ఉప్పెన మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ మూవీ చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్ ని సొంత చేసుకుని తొలి సినిమాతోనే హీరోగా వైష్ణవ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: