భీమ్లా నాయక్ సినిమా కథను వివరించే పాటే అడవి తల్లి మాట..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా  హీరోలుగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు, ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా  నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్న భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది, అందులో భాగంగా తాజా గా అడవి తల్లి మాట అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 'అడవి తల్లి మాట' పాటకు థమన్ అదిరిపోయే  ట్యూన్ ను సమకూర్చడు. 
ఈ పాట కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ని అందించాడు. ఈ పాట ని జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ మరియు సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అహం - ఆత్మాభిమానం నేపథ్యం లో 'భీమ్లా నాయక్' సినిమా ను తెరకెక్కిస్తున్నారు.

 ఇప్పుడు తాజా గా విడుదల చేసిన 'అడవి తల్లి మాట' అనే పాట భీమ్లా నాయక్ సినిమా సారాంశాన్ని తెలియజేస్తుంది. భీమ్లా నాయక్ - డేనియల్ శేఖర్ ల మధ్య గొడవల కారణం గా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఈ పాట లో మనం చూడొచ్చు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, రానా లతో పాటు నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కనిపించారు. ఇలా ఈ పాట తో భీమ్లా నాయక్ చిత్ర బృందం తాము చెప్పాలి అనుకున్న కథ గురించి ఈ పాటలు చెప్పే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: