నయనతార నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..ఏం మేం పనికిరామా..?
త్వరలోనే ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ఈ అందాల తార నయన తారకు ఇంకా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈమె..టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నచ్చి మెచ్చి రీమేక్ చేస్తున్న సినిమా లూసిఫర్ లో ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో గాడ్ ఫాదర్ గా రాబోతున్న ఈ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలు గా నటించనుంది. ఈ విషయాని చిత్ర బృందం నయనతార పుట్టిన రోజు సంధర్భంగా తెలియజేసారు. ఇది వరకే నయనతార చిరంజీవి పక్కన ఓ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక గాడ్ ఫాదర్ సినిమాలో నయనతారకు భర్త గా సత్యదేవ్ ను ఎంపిక చేసిన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే అమ్మడు ఈ విషయంలో సముఖంగా లేన్నట్లు తెలుస్తుంది. లూసిఫర్ సినిమా ఒరిజినల్ వెర్షన్లో మంజువారియర్ పోషించిన పాత్రను నయనతార ఇప్పుడు తెలుగులో చేయనుంది. అయితే మంజువారియర్ భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమా లో నటించారు. ఇప్పుడే అదే పాత్రలో తెలుగులో సత్యదేవ్ ఫిక్సయినట్టు వార్తలు వస్తున్న క్రమంలో మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. తన భర్త పాత్ర కోసం సత్య దేవ్ ని ఎంపిక చేయడం పట్ల నయనతార అసహనం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తుంది. వెంటనే అతడిని తీసేసి ఆ పాత్రలో సుదీప్ ని కానీ, లేకపోతే వేరే తమిళ నటుడిని కానీ పెట్టమని డైరెక్టర్ కు సూచించిందట. ఇక దీని పై సత్యదేవ్ అభిమానులు నయన తార పై మండిపడుతున్నారు. నీ కంటికి తమిళ హీరోలే కనిపిస్తారా..? తెలుగు వాళ్ళు పనికిరారా..?? అంటూ ఫైర్ అవుతున్నారు.