ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందిస్తున్న అలీ..!
అలీ ఇండస్ట్రీకి బాల నటుడిగా సీతాకోకచిలుక సినిమాతో పరిచయమైయ్యాడు. ఈ సినిమాలో అలీ నటనకు అవార్డుతో పాటు, మంచి గుర్తింపుని కూడా తీసుకొచ్చింది. అలీ ఆ తరువాత కమెడియన్ గా అవతారం మెత్తారు. ఇక 'ప్రేమఖైదీ' సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
అయితే అలీ ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటారు. ఆయన తన తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు.. అలీ సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకున్నారు. అయితే 1999 లో నటుడు మురళీమోహన్ అలీ కి తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక 2019 మార్చిలో వైసీపీలో చేరారు. అలాగే అలీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చాలా చురుకుగా ఉంటారు. అలీ తన తల్లి పేరు మీద పేదలకు బట్టలు కూడా పంపిణి చేశారు.