చిరుతో నటించాలంటే.. అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న శృతి..!
అందులో బాబి కాంబినేషన్లో ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. అందులో కథానాయికగా శృతిహాసన్ ను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. చిరంజీవి ఖైదీ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ అభిమానులను షాక్ అయ్యేలా చేస్తున్నాడు. అది కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ, యంగ్ హీరోయిన్స్ తో నటిస్తున్నాడు. తన కొడుకు తో నటించిన హీరోయిన్లు సైతం చిరంజీవి కూడా నటిస్తున్నాడు.
శృతిహాసన్ ఎవడు సినిమాలో చరణ్ కు జోడీగా నటించగా. ఇప్పుడు తాజాగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి సరసన శృతి హాసన్ ని ఎంపిక చేయనున్నట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె సలార్ సినిమాలో నటిస్తున్నది. ఇక ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో కలిసి యాక్టింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాలి. ఒకవేళ ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటే దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.
బాబీ , చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి శీను అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంవత్సరంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాబీ ఇదివరకే జై లవకుశ, వెంకీ మామ సినిమాలను నిర్మించాడు.