మొత్తానికి భారీ ప్రాజెక్ట్ ని పట్టిన చరణ్ .... ??

GVK Writings
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా రాజమౌళి ఈ సినిమాని ఎంతో భారీ స్థాయిలో తీసిన సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొగా దీనిని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక దీనితో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఆచార్య సినిమాలో సిద్ద అనే పాత్ర చేస్తున్నారు చరణ్.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో చరణ్ కి జోడీగా పూజా హెగ్డే, మెగాస్టార్ కి జోడీగా కాజల్ నటిస్తుండగా కొరటాల శివ దీనిని నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ తో నెక్స్ట్ సినిమా ని ఇటీవల అనౌన్స్ చేసి అధికారిక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన చరణ్ త్వరలో దానిని పట్టాలెక్కించనున్నారు. అయితే ఈ మూవీస్ అనంతరం యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో తదుపరి సినిమా చేయనున్నట్లు నేడు దసరా పండుగ సందర్భంగా అనౌన్స్ చేసారు చరణ్.
యువి క్రియేషన్స్ సంస్థ దానిని నిర్మించనుంది. ఐతే ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, త్వరలో ప్రశాంత్ నీల్ తో డివివి దానయ్య నిర్మాతగా మరొక భారీ సినిమా కూడా చేయనున్నారు చరణ్. నేడు మెగాస్టార్, మెగాపవర్ స్టార్ తో కలిసి దానయ్య, ప్రశాంత్ నీల్ ఇద్దరూ కూడా డిన్నర్ చేసిన ఫోటోలు ఉదయం నుండి వైరల్ అవుతుండగా చరణ్ తో దానయ్య, ప్రశాంత్ ల సినిమా కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి రామ్ చరణ్ మరొక భారీ ప్రాజక్ట్ ని చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి వీటి తో చరణ్ ఏ స్థాయిలో విజయాలు అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: