వైష్ణవ్ మళ్ళీ "కొండపొలం" తో హిట్ కొట్టేశాడోచ్...
ఓ వైపు ఉప్పెన సినిమాతో తన నటనను పీక్స్ లో చూపించిన మెగా లక్కీ హీరో వైష్ణవ్ తేజ్, మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్, ఇంకోవైపు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఇలా అన్ని విధాలుగా ఈ సినిమా పై ముందు నుండే అంచనాలు నెలకొన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటన వేరే లెవల్ అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. రకుల్ కూడా నటనలో తన సీనియారిటీని చూపించింది. ఢీ గ్లామరస్ పాత్ర అయినా సహజమైన నటన మరియు తన అందాలతో సినిమాకి ప్లస్ గా నిలిచింది. కోట శ్రీనివాసరావు, సాయి చంద్, రచ్చ రవి తదితర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎంతో అందమైన భావోద్వేగాలతో నిర్మించబడ్డ ఈ చిత్రంకి టాక్ బాగుంది. కానీ ఊహించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేవని తెలుస్తోంది.
కానీ ఇప్పుడిప్పుడే హిట్ టాక్ ఊపందుకున్న నేపథ్యంలో...ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. అయితే ఇప్పటికే విడుదలైన నాగ చైతన్య లవ్ స్టోరీ మరియు సాయి తేజ్ రిపబ్లిక్ చిత్రాలు కొండపొలం చిత్రం రాకతో కాస్త వెనక పడ్డట్టు సమాచారం. ఇంకో వారం పోతే కానీ కొండపొలం లోతెంతో పూర్తి క్లారిటీ రాదని అంటున్నారు. మరి ఈ చిత్రం వైష్ణవ తేజ్ కి మరో హిట్ ను అందించి లక్కీ హీరో అన్న టాక్ ని క్యారీ చేస్తుందో లేదో తెలియాల్సి ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా అట్రాక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్ ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.