బన్నీ నయా బిజినెస్..!

Podili Ravindranath
స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వ్యాపార బాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సొంత వ్యాపారాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్‌కు పోటీగా... ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా వ్యాపార సామాజ్ర్యాలు విస్తరిస్తున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కూడా నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లితే... మరికొంతమంది ఫ్యాషన్ వేర్, గేమింగ్ జోన్... ఇలా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే బాటలో ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా నడుస్తున్నాడు.
దేశ వ్యాప్తంగా మల్లిపెక్స్‌ వ్యాపారం చేస్తున్న ఏషియన్ సినిమా సంస్థ... తెలుగులో అగ్రహీరోలతో వ్యాపార భాగస్వామ్యం చేస్తోంది. తమ వ్యాపారాల్లో స్టార్ హీరోలు పెట్టుబడులు పెట్టేలా ఏషియన్ సినిమా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్వహిస్తోంది. ఏఎంబీ సినిమా పేరుతో 7 స్క్రీన్స్‌తో భారీ మల్లీప్లెక్స్‌ను గచ్చిబౌలిలో నిర్వహిస్తోంది. అదే విధంగా మరో హీరో విజయ్ దేవరకొండతో కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలో ఏవీడీ సినిమా పేరుతో మరో మల్టిప్లెక్స్ నిర్మించింది. ఇది ఈ నెల 24వ తేదీన లవ్‌స్టోరీ సినిమాతో ప్రారంభం కానుంది. ఇదే ఊపుతో మరో స్టార్ హీరోను కూడా తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్న ఏషియన్ సినిమా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఏషియన్ సినిమా ఇప్పుడు చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట సెంటర్‌లో ఉన్న సత్యం ధియేటర్‌ను తీసుకున్న ఏషియన్ సినిమా గ్రూప్..... దాన్ని పూర్తిస్థాయిలో మల్టీప్లెక్స్‌గా మార్చేస్తోంది. ఈ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యాయి. వీటికి ఏఏఏ సినిమాస్ అనే పేరు కూడా పెట్టేసింది. దీని నిర్మాణ పనులు శరవేగంతో పూర్తవుతున్నాయి. కరోనా కారణంగా ఆలస్యమైనప్పటికీ... ఈ మధ్యనే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ధియేటర్‌ను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది ఏషియన్ సినిమాస్ గ్రూప్. ఈ విషయం బయటకు రాగానే... బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AAA

సంబంధిత వార్తలు: