డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్న హీరోయిన్..!
పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ స్టార్ హీరోలకి కూడా కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ఒక వైపు తమిళ్, మరోవైపు హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. దీంతో యంగ్స్టర్స్కి యూత్లో క్రేజ్ ఉన్న హీరోయిన్ దొరకడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలోనే 'ఉప్పెన'తో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత విడుదలైన ఈ సినిమా 2021లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్గా నిలిచింది. కృతికి క్రేజీ ఫాలోయింగ్ వచ్చింది.
కృతి శెట్టికి 'ఉప్పెన' తర్వాత వరుస సినిమాలొస్తున్నాయి. బేబమ్మ క్యారెక్టర్తో యూత్కి బాగా కనెక్ట్ అయింది కృతిశెట్టి. దీంతో ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి యంగ్ హీరోలంతా కృతి వెంట పడుతున్నారు. నాని 'శ్యామ్ సింగారాయ్'కి తీసుకుంటే, సుధీర్ బాబు 'ఆ అమ్మాయ గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తున్నాడు.
నాగార్జునని తొలిసారి 50 కోట్ల క్లబ్లో చేర్చిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఇప్పుడీ మూవీకి ప్రీక్వెల్గా 'బంగార్రాజు' అనే సినిమా వస్తోంది. ఈ మూవీలో నాగచైతన్యకి జోడీగా నటిస్తోంది కృతి. అలాగే లింగుసామి-రామ్ బైలింగ్వల్ మూవీ కూడా చేస్తోంది. వీటితోపాటు నితిన్తో 'మాచెర్ల నియోజకవర్గం' అనే సినిమా చేస్తోంది కృతిశెట్టి.
మొత్తానికి కృతిశెట్టి అందివచ్చిన అవకాశాలను కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటోంది. ఫామ్ లో ఉన్నప్పుడే ఏదైనా చేయాలని భావిస్తోంది.