నటుడు ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి..!!

Anilkumar
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఆయన భార్య పద్మావతి కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.హైదరాబాద్ లోని బాలకృష్ణ స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో గత కొంతకాలంగా చికిత్సను తీసుకుంటున్న ఆమె.. హఠాత్తుగా ఈ రోజు ఉదయం మరణించారు. ఇక తన భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించే వారు.దాంతో పాటూ ఉత్తేజ్ కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా ..

పద్మావతి నిర్వహించేవారు.అంతేకాకుండా ఉత్తేజ్ చేసే పలు సేవా కార్యక్రమాల్లో సైతం పద్మావతి భాగం పంచుకునేవారు.ఇక ఉత్తేజ్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నటుడిగానే కాకుండా రచయిత ఎంతో టాలెంట్ ఉన్న ఉత్తేజ్..పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'మనీ' సినిమాతో రచయితగా మారాడు ఉత్తేజ్.ఈ సినిమాతో పాటూ మనీ మనీ, ఖడ్గం వంటి సినిమాలకు కూడా మాటల రచయితగా పనిచేశాడు.

ఇక ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఉత్తేజ్ కి మామగారు అవుతారు.ఇక రచయిత పనిచేసిన తర్వాత నటుడిగా మారి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఉత్తేజ్ భార్య మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి,ప్రకాశ్ రాజ్,జీవిత రాజశేఖర్,బ్రహ్మాజీ తదితరులు ఉత్తేజ్ ఇంటికి చేరుకొని  ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు.అందుకు సంబంధించిన ఓ విడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఉత్తేజ్ తో పాటూ ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తేజ కూతురు తన తల్లిని తలచుకొని కన్నీటి పర్యంతం అవుతుంటే చిరంజీవి దగ్గరుండి వారిని ఓదార్చారు.ఇక ఆ తర్వాత ఉత్తేజ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: