పవన్ కళ్యాణ్ తో నటించబోతున్న బుట్టబొమ్మ...!

murali krishna
టాలీవుడ్ లో పూజ హెగ్డే గోల్డెన్ లెగ్ గా మారింది.ఇండస్ట్రీ రికార్డ్ హిట్ అల వైకుంఠపురములో తర్వాత తన రేంజు మరో లెవల్ కి చేరుకుందని తెలుస్తుంది.ఇప్పుడు పూజా ఎంత అడిగితే అంతే ఇస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు. పారితోషికంలో పూజా డిమాండ్లపై నిరాశ చెందేవాళ్ళు కూడా వున్నారని తెలుస్తుంది.
అయితే పూజా ఇంతకాలం పవన్ సరసన ఆఫర్ అందుకోని విషయం అందరికి తెలిసిందే. వరుసగా బన్ని మరియు వరుణ్ తేజ్ లతో నటించేసిన ఈ బ్యూటీ తదుపరి రామ్ చరణ్ సరసన ఆచార్యలో నటిస్తుంది. ఇక పవన్ కల్యాణ్ తన టార్గెట్ అని తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ తో తన స్నేహాన్ని పూజా వర్కవుట్ చేస్తోందని సమాచారం.ఆ ఇద్దర్నీ టాలీవుడ్ మంచి స్నేహితులుగా కలిపిందని తెలుస్తుంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన `దువ్వాడ జగన్నాథమ్` లో అమ్మడు మొదట హీరోయన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో వచ్చిన అవకాశం కూడా ఆ సినిమా మంచి ఫలితాలు కూడా సాధించిందని తెలుస్తోంది. ఆ సక్సెస్ తర్వాత పూజా హెగ్డేకి వరుస అవకాశాలు వచ్చాయట. అలా పూజా హెగ్డే కెరీర్ లో హరీష్ మంచి స్నేహితుడిగా మారాడని సమాచారం. ఆ స్నేహంతోనే `గద్దలకొండ గణేష్` లో పూజా నాయికగా నటించిందని సమాచారం. నటిగా బిజీగా ఉన్న సమయంలోనూ హరీష్ తో స్నేహం కారణంగా ఈ చిత్రానికి అంగీకరించిందని వార్తలు వినిపించాయి.
ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా హరీష్ శంకర్ కి మంచి స్నేహితుడని తెలుస్తుంది. హరీష్ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ దాదాపు దేవి శ్రీనే సంగీతం సమకూర్చారని సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ `భవదీయుడు భగత్ సింగ్` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసారని సమాచారం. ప్రస్తుతం హరీష్ ఆ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే అనూహ్యంగా ఈ ముగ్గురు వీడియో కాల్ లో క నెక్ట్ అయ్యారని సమాచారం. ముందుగా హరీష్-పూజా హెగ్డే సంభాషించుకుంటున్నారని తెలుస్తుంది.
ఇంతలో రాక్ స్టార్ కూడా లైన్ లోకి వచ్చారని సమాచారం.దీంతో ముగ్గురి మధ్య సరదా సంభాషణలు సాగినట్లు సమాచారం. అయితే భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది. ఇంకా ఇందులో హీరోయిన్ ని ఫైనల్ చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఆ ఛాన్స్ పూజా హెగ్డే అందుకుందన్న వార్త గట్టిగా వినిపిస్తోందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ మరియు కోలీవుడ్ అలాగే బాలీవుడ్ ల లో బిజీగా ఉందని సమాచారం. మూడు భాషల్లో మూడే సినిమాలు చేస్తోందని తెలుస్తుంది.కరోనా కారణంగా జూమ్ మీటింగులతోనే కోట్లాది రూపాయల విలువైన డీల్స్ కుదురుతున్నాయని తెలుస్తుంది. కథానాయికల్ని ఇలానే ఫైనల్ చేసేస్తుండడం ఆసక్తికరంగా ఉందని తెలుస్తుంది.
పూజా హెగ్డే నటించిన ఆచార్య-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ - రాధేశ్యామ్ విడుదలకి రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ వరుస చిత్రాలకు సంతకాలు చేస్తూ మూడు పరిశ్రమల్లో బిజీగా ఉందని సమాచారం. సినిపరిశ్రమలో భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఆమెనే కోరుతున్నారని సమాచారం. ఇటీవల పూజా మహేష్ బాబు - త్రివిక్రమ్ చిత్రానికి సంతకం చేసిందట. ఇంతలోనే పవన్ తో ఆఫర్  అలాగే మరో రెండు ఆఫర్లు దక్కాయని సమాచారం. త్వరలో ప్రారంభించబడే మరో రెండు పెద్ద సినిమాలపై కూడా సంతకం చేయనుందని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: