సినిమాలకు అప్పుడే గుడ్ బాయ్ చెప్పాలనుకున్నాను..శృతిహాసన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రశాంతి నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శృతిహాసన్ నటిగా కంటే ముందే గాయనిగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మనందరికీ తెలిసిందే. శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ హీరోగా నటించిన 'ఈనాడు' సినిమా లో ఈ ముద్దుగుమ్మ ఒక పాట పాడింది. ఆ తర్వాత కూడా కమల్ దర్శకత్వంలో వచ్చిన 'హేరామ్'  సినిమాలో అతిధి పాత్రలో కనిపింఛి మూవీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా నటిగా తన జర్నీ ప్రారంభించిన శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు సంగీతం అంటే ప్రాణం అని చెప్పుకొచ్చింది. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోనే సినిమాల్లోకి వచ్చినట్టు కూడా తెలియజేసింది. ఈ సందర్భంగా మ్యూజిక్ అంటే అంత ఇష్టం ఉన్నా  ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి ఎందుకు వచ్చిందో వివరించింది.

కాలేజీ రోజుల్లో రాక్ స్టార్  అవ్వాలని చాలా కలలు కనేదాన్ని..ఎలాగైనా సొంతగా ఒక రాక్ బ్యాండ్ నడపాలి అనుకున్నాను. అయితే రాక్ బ్యాండ్ నడపాలంటే డబ్బు అవసరం కానీ నా దగ్గర అప్పుడు అంతగా డబ్బు లేదు. అయితే రెండు మూడు సినిమాలలో నటించి ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో రాక్ బ్యాండ్ పెట్టుకోవాలని, ఆ వెంటనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలని అనుకున్నట్లుగా తెలియజేసింది. కానీ సినిమాల్లోకి వచ్చాక నాకు తెలియకుండానే సినిమా తో ప్రేమలో పడిపోయాను,  సినిమానే నా ప్రాణం అయిపోయింది, ఇప్పుడు నా ప్రపంచం సినిమానే అంటూ  వివరించింది. నేను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మ్యూజిక్ మాత్రం వదిలిపెట్టను. సినిమా షూటింగ్ ల మధ్య ఏ కాస్త విరామం దొరికినా ఆ సమయాన్ని మ్యూజిక్ కేటాయిస్తాను అని తెలియజేసింది. కాగా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతాను తో కలిసి మ్యూజిక్ బ్యాండ్ మొదలుపెట్టే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: