మోహన్ బాబు తినే కంచంలో * పోశారా..?

Divya
కలెక్షన్ కింగ్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన  కేవలం నటుడు మాత్రమే కాదు,  తన సొంత డబ్బులు ద్వారా విద్యాలయాలను కూడా ఏర్పాటు చేసి, ఎంతో మంది పిల్లలను ర్యాంకర్ లుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే అడిగిన వారికి కాదనకుండా తన వంతు సహాయం చేస్తూ, అందరిని ఆదుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో  ప్రముఖ నటుడు మరణిస్తే , ఆయన కుటుంబానికి అండగా ఉండాలని , ఆయన కొడుకుని చదివిస్తానని  కూడా భరోసా ఇచ్చాడు. ఇంత దయా హృదయం కలిగిన వ్యక్తి అప్పట్లో కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొన్నారట.
సాధారణంగా హీరో అవ్వాలి అంటే ఎన్నో ఒడిదుడుకులను, ఎదుర్కొని, కష్టాల కడలిని దాటక తప్పదు. ఈ నేపథ్యంలోనే ఎన్ని కష్టాలను,  నష్టాలను ఎదుర్కొన్న కూడా అది వారికి ఇబ్బందిగా అనిపించదేమో..అలా ఈ నేపథ్యంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  ఎదుర్కొన్న ఒక దుర్ఘటనను ఇటీవల ప్రసారం కాబోయే డ్రామా జూనియర్స్ షో లో ఆలీ వెల్లడించారు. ఈ షోలో ఆలీ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ  ఆదివారం విడుదల కాబోతున్న డ్రామా జూనియర్ ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఈ షోకి మంచు లక్ష్మి కూడా హాజరవడం విశేషం
ఈ ప్రోమోలో  భాగంగానే ఎంతోమంది ఉన్నత చదువులు చదివిన వారు వచ్చి , ఒక స్కిట్ వేయడం జరిగింది. అంతేకాదు కరోనా వచ్చిన తర్వాత అంతా కొట్టుకుపోయిందంటూ , రేషన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు వచ్చాయంటూ,  వారు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. చాలామంది డబ్బులు లేక ఎంత అవస్థలు పడుతున్నారో, ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.. అంతేకాదు ఈ షో ప్రోమో లో ఆలీ  మోహన్ బాబు గురించి చెప్పిన మాట ప్రస్తుతం విన్న వారి కంట నీరు వచ్చేలా చేస్తోంది.
ఇకపోతే ఆలీ మాట్లాడుతూ .." మోహన్ బాబు గారు సినీ ఇండస్ట్రీ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో,  మూడు నుండి నాలుగు నెలలు ఇంటి అద్దె కట్టలేదని..వీడు డబ్బు కట్టడం లేదంటూ, ఆ  ఇంటి ఓనర్ మోహన్ బాబు తినే కంచంలో మల మాత్రం వెళ్ళాడట. ఇక  ఈ విషయం ఎంత దుర్ఘటన అంటే  అసలు చెప్పడానికి కూడా మాటలు  రావడం లేదు..అంటూ ఆలీ ఎంతో  కృంగిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: