ఆమె రాకతో తెలుగు సింగర్స్ లో గుబులు !

Seetha Sailaja
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సింగర్స్ పారితోషికాలు కూడ లక్షలలో ఉంటున్నాయి. సినిమా పాటలతో పాటు స్టేజ్ షోలు విదేశీ పర్యటనలలో మ్యూజిక్ షోలు మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా డబ్బింగ్ లు చెపుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేకమంది ఫిమేల్ మేల్ సింగర్స్ సెలెబ్రెటీ హోదాలను ఎంజాయ్ చేస్తున్నారు,

వీరిమధ్య పోటీ కూడ చాల ఎక్కువగా ఉంటున్న పరిస్థితులలో కొంతమంది సంగీత దర్శకులకు పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక మళయాళ సింగర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తికర చర్చలు చేస్తున్నాయి. ఆమె పేరు వైకోమ్ విజయలక్ష్మి ప్రస్తుతం మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.  

ఆమె గాయని మాత్రమే కాదు ఆమె వీణను కూడ అద్భుతంగా శృతి చేసి వినిపించగలదు. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ లో రీమేక్ లో రెండు పాటలు పాడుతోంది. ఆ రెండు పాటలు కూడ మంచి మాంటేజ్ సాంగ్స్  అని అంటున్నారు. అరవింద సమేతలో మాదిరిగా ఈ మాంటేజ్ సాంగ్ లను కూడా హిట్ చేయాలనే సంకల్పంతో తమన్ ఉండటంతో ఈ రెండు పాటలు ఆమె తో పాడించారట. ఇప్పటికే ఈ రెండు పాటల రికార్డింగ్ పూర్తి అయింది అని అంటున్నారు. ఈమె గొప్పతనం కొందరి ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సూచనతో ఈ మళయాళ సింగర్ ఎంట్రీ ఇప్పుడు జరుగుతోంది అని అంటున్నారు.

సుశీల జానకీ తెలుగు సినిమా పాటల రంగాన్ని శాసిస్తున్న రోజులలో చిత్ర ఎంట్రీ తో సుశీలకు అవకాశాలు అప్పట్లో తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ అదే మళయాళ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఇప్పుడు మళ్ళీ వైకోమ్ విజయలక్ష్మీ ఎంట్రీతో మన పాపులర్ తెలుగు ఫిమేల్ సింగర్స్ కు గట్టిపోటీ ఏర్పడే అవకాశం ఉంది అంటూ అప్పుడే ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాలలో మొదలుకావడం ఒక విధంగా మన టాప్ ఫిమేల్ సింగర్స్ ను కలవర పాటును కలిగించే విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: