ఆ ఇద్ద‌రు హీరోయిన్ల దెబ్బ‌తో నాగార్జున‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదా ?

VUYYURU SUBHASH
టాలీవుడ్లో దివంగత లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా సినిమా రంగంలోకి వచ్చిన అక్కినేని నాగార్జున విక్రమ్‌ సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆఖరిపోరాటం - విక్కీ దాదా - శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తిరుగులేని స్టార్ హీరోగా మారిపోయారు. నాగార్జున కెరీర్ ఆరంభం నుంచే అమ్మాయిల మదిని దోచే కలగా హీరో గా మారిపోయారు. అప్పట్లో నాగార్జున సినిమా వస్తుందంటే లేడీస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండేది కాదు. ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాల్లో నటించిన నాగార్జున ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్య లో రియల్ గా నలిగిపోయాట‌.
ఆ ఇద్ద‌రు హీరోయిన్లు నాగార్జున కంటే చాలా సీనియ‌ర్లు.. వారు సినిమాల్లోకి వ‌చ్చిన చాలా యేళ్ల‌కు కాని నాగార్జున రాలేదు. దీంతో నాగార్జున‌ను షూటింగ్ స్పాట్లోనే వారు క‌ళ్ల చూపుల‌తోనే టీజ్ చేసి ప‌డేశార‌ట‌. ఆ సినిమా ఏదో కాదు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున సరసన సుహాసిని, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల ఆధారంగా ఆఖరిపోరాటం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన శ్రీదేవి, సుహాసిని ఇద్దరు అప్పటికే నాగార్జున కంటే చాలా సీనియర్లు.
సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు ఎవరు కూడా నాగార్జునను అసలు పట్టించుకునే వారే కాదట. శ్రీదేవి లేకపోతే సుహాసినిని మాత్రమే చూసేవారట. దీంతో నాగార్జున  ఒక మూల కూర్చుని ఉండేవారట. తన సీన్ షూట్ చేయాల్సి ఉన్నప్పుడు మాత్రమే సెట్స్ మీదకు రావడం... తర్వాత మళ్లీ వెళ్లి కూర్చోవడం చేసేవారట. చివ‌ర‌కు శ్రీదేవి, సుహాసిని మాట్లాడించినా కూడా ఊఊ.. అని స‌రిపెట్టేసేవార‌ట‌. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఒప్పుకున్నారు. ఒకానొక దశలో తన‌ను ఎవరూ పట్టించుకోకపోవడంతో తాను ఎంతో ఫీల్ అయ్యాను అని కూడా నాగ్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: