అప్పుడు చిరుకు.. ఇప్పుడు బెల్లంకొండకు మాత్రమే ఇది..
ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి, బాలీవుడ్ ఎంట్రీకి, రాజశేఖర్ నటించిన"అంకుశం"మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. చిరంజీవికి, రవిరాజా పినిశెట్టి కి ఇదే మొదటి సినిమా బాలీవుడ్లో.. ఈ సినిమా ద్వారానే అల్లు అరవింద్ నిర్మాతగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నాడని విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా వీ వీ వినాయక్ డైరెక్టర్ గా హిందీలోకి మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే.. బెల్లంకొండ తన మొదటి సినిమా కూడా ఈయన తోనే చేశాడు.
ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక చిరంజీవి లాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంటాదా లేదా అనే సందేశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా నాగార్జున, వెంకటేష్ కూడా బాలీవుడ్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చారు. కానీ చిరంజీవి వేరొకరు తీసిన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అలా అప్పట్లో చిరంజీవి చేయగా.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇలా చేయడం విశేషం.