చూపించేందుకు నేను రెడీ..! కొత్త బ్యూటీ ఆఫర్..!

NAGARJUNA NAKKA
తెలుగు ఇండస్ట్రీని కొత్త అందాలు తాకుతున్నాయి. ఇప్పటి వరకు మంగళూరు భామలే టాలీవుడ్ ను మాయ చేసేవారు. తాజాగా మాలీవుడ్ భామలు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. ఇంకేముందీ మాలీవుడ్..మంగళూరు భామల మధ్య ఒక రేంజ్ లో కాంపిటీషన్ వచ్చేసింది. తాజాగా ఒక కేరళ భామ ఎంట్రీ ఇచ్చేసింది. అన్నీ చూపించేసి.. అందరి కంటే ముందుంటానంటూ టాలీవుడ్ లో ఆశలు రేపుతోంది.
టాలీవుడ్ కొత్త అందాలతో కలర్ ఫుల్ గా మారింది. అటు మంగళూరు.. ఇటు కేరళ భామల అందాలతో కొత్త రూపు సంతరించుకుంది. కొందరు భామలు మాత్రం కథా బలమున్న చిత్రాలతో పాపులర్ అయి...వారి పేర్లు ప్రజల నోళ్లలో నోటెడ్ అయిపోతాయి. ఇంకొందరు అయితే సరిగా గుర్తింపు లేకుండా ఉండిపోతున్నారు. ఇటీవల ఉప్పెన సినిమాతో కృతిశెట్టికి మంచి పేరు ఉంది. ఇటీవల టాలీవుడ్ ను పలుకరించిన మాలీవుడ్, శాండిల్ వుడ్ బ్యూటీలలో మంచి పేరుంది. ఉప్పెన సినిమాలో చూపించాల్సిందంతా చూపించేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ దెబ్బకు ఈమెకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పైగా పలు షాపింగ్ మాల్స్ సైతం కృతిశెట్టితో రిబ్బన్ కటింగ్ చేయించుకుంటున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ అందాల భామ రేంజ్ ఎంత ఉందో. ఇక అను ఇమ్మాన్యుయేల్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ కు అసలు సినిమా ఛాన్స్ లే రావడం లేదు.
లేటెస్ట్ గా రవితేజ హీరోగా వస్తున్న రామారావ్ ఆన్ డ్యూటీ చిత్రంలో ఇద్దరు బ్యూటీలు సెలక్ట్ అయ్యారు. వారిలో ఒకరు మజిలీ ఫేం దివ్యాన్ష కౌశిక్ .. మరొకరు రజీషా విజయన్. రజీషా విజయన్ మాలీవుడ్ లో గత ఆరేళ్ల నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. కాకపోతే మొన్న ఈ మధ్య తమిళ్ లో ధనుష్ తో కర్ణణ్ లో నటించి కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో మాస్ రాజా  సినిమాతో అవకాశం రావడంతో ఎగిరిగంతేస్తోంది. ఇప్పటికే తమిళంలో సూర్య, జ్ణానవేల్ ప్రాజెక్ట్ లో చేస్తున్న ఈ కేరళ బ్యూటీకి తొలి తెలుగు చిత్రంపై ఎక్కువ ఆశలే పెట్టుకుంది. చూపించాల్సింది ఏముందో అదంతా చూపించేసి.. ప్రేక్షకులను ఫిదా చేస్తానంటోంది ఈ బ్యూటీ.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: