నటి సుమలత గురించి ఈ విషయాలు తెలుసా.. ?

Mamatha Reddy
అలనాటి హీరోయిన్ సుమలత గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. శుభలేఖ, ఖైదీ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈమె.  తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను అందుకున్న సుమలత నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే నటి. మరి ఆమె సినిమాల విషయాలు పక్కన పెట్టి  వ్యక్తిగత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1963 ఆగస్టు 27న మద్రాసులో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబై ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పెరిగింది. దాంతో ఆమెకు వివిధ భాషలు అలవడ్డాయి. మొత్తంగా ఆమెకు ఆరు భాషలు వచ్చినట్లు తెలుస్తోంది. 15వ యేట సినిమా రంగంలోకి అడుగుపెట్టింది సుమలత. విజయ్ చందర్ హీరోగా బాలు దర్శకత్వంలో వచ్చిన రాజాధిరాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ సమాజానికి సవాల్ అనే సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.  11 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో పని చేసి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత 1992 లో నటుడు అంబరీష్ ను ప్రేమ వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. వీరిద్దరూ కలసి ఆహుతి శ్రీ మంజునాథ అవతారపురుషుడు వంటి హిట్ చిత్రాల్లో నటించగా ఈ సమయంలోనే వారికి ప్రేమ చిగురించి పెళ్లి దాకా దారి తీసింది. వీరికి అభిషేక్ అనే కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆ మధ్య నాగార్జున హీరోగా వచ్చిన బాస్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. బుల్లితెరపై కూడా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. జీ తెలుగులో బతుకు జట్కాబండి అనే సామాజిక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి. కన్నడ రాజకీయాల్లో కూడా తనదైన పాత్ర పోషించింది సుమలత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: