AVS అల్లుడు కూడా మనకు తెలిసిన నటుడే !

Mamatha Reddy
టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్ లు తమ నటనతో హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తమకే సొంతమైన నటనతో కొందరు హాస్య నటులు ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యే విధంగా నవ్వించారు. ఆ విధంగా టాలీవుడ్ లో గొప్ప కమెడియన్ ల సరసన చేరారు ఏవీఎస్. ఆమంచి వెంకట సుబ్రమణ్యం ఆయన పూర్తి పేరు కాగా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఆయన పలు పాత్రలు పోషించారు. రాజకీయ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా కూడా పనిచేశారు ఏవీఎస్.
 

కాలేజీలో చదువుకునే సమయం నుంచే ఆయన సినిమాలపై ఎంతో ఆసక్తి చూపించేవారు. నాటకాల్లో నటిస్తూ రసమయి సంస్థ ను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. మిమిక్రీ కళాకారునిగా పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్ నిర్మించిన శ్రీనాధ కవి సార్వ భౌముడు సినిమా లో నటించిన మిస్టర్ పెళ్ళాం సినిమా ముందుగా విడుదలైంది. ఈ రెండు సినిమాలకు బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికి నంది అవార్డు దక్కించుకున్న గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు. తొలి సినిమా హిట్ కావడంతో ఏవీఎస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. 500 పైగా నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు ఏవీఎస్.

ఇక ఏ వి ఎస్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయనకు ఓ కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కు సినిమాలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిలైపోయాడు. కూతురు ప్రశాంతి తండ్రికి లివర్ ప్లాన్ ట్రాన్స్ ప్లంటేషన్ లో సహాయపడింది. కొంతకాలం జీవించిన తర్వాత ఆయనకు అన్ని శరీర భాగాలు ఫెయిల్ కావడంతో మరణించాడు. ఇక ఆయన అల్లుడు చాలా సినిమాల్లో నటించారు. మంచి మంచి పాత్రలు పోషించారు. ఏవీఎస్ అల్లుడు చక్రవర్తి ని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

AVS

సంబంధిత వార్తలు: