అందులో రాజీపడే సమస్యే లేదు : నటి అనిత

Divya

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ఎన్నో ఆశయాలతో అడుగు పెడుతూ వుంటారు. ఇక మరికొంతమంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. మరికొంతమంది అనతి కాలంలో నే  స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇక మరి కొంతమందేమో అప్పట్లో తమ నటనతో అందరినీ బాగా ఆకట్టుకొని, ప్రస్తుతం తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో మీనా, రోజా, నదియా, ఆమని వంటి హీరోయిన్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ ఓవర్ నైట్ కి ఒక్క సినిమాతోనే స్టార్డం సంపాదించే హీరోయిన్లు చాలా ఎక్కువమంది ఉంటారు. అలా స్టార్డం సంపాదించిన వారిలో అనిత కూడా ఒకరు. నువ్వు నేను సినిమాతో తెలుగులోకి పరిచయమై, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది.

అయితే సినీ ఇండస్ట్రీలో సినిమాల నుంచి తప్పుకోవడం కామన్ గా జరుగుతున్న విషయమే.. కానీ కొంతమంది హీరోయిన్లు పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక అలా వదిలేస్తుంటారు. ఇక  అనిత కూడా అలాంటి నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ లలో కూడా ఒకరు. ఈమె చేసిన సినిమాలలో తొట్టి గ్యాంగ్, శ్రీరామ్ , నేనున్నాను, ఆడంతే .. ఆడో  టైపు వంటి ఎన్నో సినిమాలు ఈమెకు మంచి పేరును తీసుకువచ్చాయి.

ఈమె తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బుల్లితెర సీరియల్స్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈమె మంచి స్టార్ గా ఉన్నప్పుడు.. రోహిత్ రెడ్డి అనే అబ్బాయిని పెళ్లాడింది. ఈ మధ్యనే వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. ఇక అందుకే  అనితా కూడా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే. ఇకమీదట బుల్లితెర , వెండితెరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. తన ఫోకస్ మొత్తం పూర్తిగా బిడ్డ పైనే ఉంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారి లేకపోయినా కూడా తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని తెలిపింది. ఏదిఏమైనా అనిత ఇకపై సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్నందుకు అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: