ప్రమాదం లో పడ్డ హీరోయిన్ కాపాడి ప్రేమలో పడేసిన హీరో
నటనతో పాటు దర్శకత్వంలో ఆయన ప్రతిభ చాటారు. ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన దర్శకుడిగా కూడా చాలా చిత్రాలు చేసి ప్రేక్షకులను మైమరిపించారు. రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా వ్యవహరించారు. అయితే నటి నర్గీస్ తో అతని ప్రేమ వ్యవహారం ఎక్కువగా చర్చకు వచ్చేది. హీరో రాజ్ కపూర్ తో ఆమెకు అనుబంధం కొనసాగుతున్న సమయంలోనే సునీల్ దత్ నర్గీస్ ను కలిశారు.
నర్గీస్ కు రాజ్ కపూర్ తో సుదీర్ఘ అనుబంధం ఉంది.అయినా ఆమె రాజ్ కపూర్ ని కాదని సునీల్ దత్ చెంతకు చేరారు. తనకు నిజమైన ప్రేమ సునీల్ నుంచే లభించిందని నర్గీస్ చెప్పేవారు కిశ్వర్ దేశాయ్ రచించిన డార్లింగ్ జీ, ది ట్రూ లవ్ స్టోరీ ఆఫ్ నర్గీస్ అండ్ సునీల్ దత్ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 1957లో సునీల్ నర్గీస్ జీవితం లోకి ప్రవేశించడానికి ముందు ఆమె తీవ్రమైన నిరాశ లో ఉంటూ ఆత్మహత్య దిశగా ఆలోచించే వారట. సరిగ్గా అదే సమయంలో మదర్ ఇండియా సినిమా షూటింగ్ సెట్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నర్గీస్ ను సునీల్ దత్ కాపాడారు. ఈ ప్రమాదంలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె సునీల్ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత వారి ప్రేమ వివాహానికి దారితీసింది.