ఈ హీరోయిన్ భర్త బాలీవుడ్ నిర్మాతలలో "కింగ్" ?
అలా హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమెకు "కుచ్ కుచ్ హోతా హై" చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక 2005లో విడుదలయిన బ్లాక్ చిత్రంతో రాణి ముఖర్జీ స్థాయి ఎవరెస్ట్ కు చేరింది. అందులో చెవిటి, గుడ్డి, మూగ అమ్మాయిగా రాణి ముఖర్జీ నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక హిందీలో ఆమె పెళ్ళికి ముందు హీరోయిన్ గా చేసిన ఆఖరి చిత్రం "మర్దానీ". ఇది 2014 లో విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది. 2014, ఏప్రిల్ 21న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మరియు దర్శకుడు అయినటువంటి ఆదిత్య చోప్రాను వివాహమాడి దాదాపుగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరి దాంపత్య జీవితంలో అప్పుడప్పుడూ వివాదాలు వస్తూ ఉంటాయి. ఈమె ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులను సాధించింది. ఆదిత్య చోప్రా బాలీవుడ్ లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ మరియు నిర్మాత అని చెప్పవచ్చు.
ఈయన తీసిన సినిమాలలో 8 సినిమాలు 200కోట్లకు పైగా వసూళ్ళు సాధించి రికార్డు సృష్టించాయి. అయితే ఆదిత్య చోప్రాకి రాణీ ముఖర్జీ తో రెండవ పెళ్లి కావడం విశేషము. ఆదిత్య చోప్రా 2009 లో తన మొదటి భార్య పాయల్ ఖన్నాతో విడాకులు తీసుకుని ఉన్నారు. ఆ తరువాత తన డైరెక్షన్ లో నటిస్తున్న రాణి ముఖర్జీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అదేరా చోప్రా అనే అమ్మాయి ఉంది. ఆదిత్య చోప్రా బాలీవుడ్ నిర్మాతలలో బడా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ఇతని సొంతం. ఈ బ్యానర్ పైనే సినిమాలను నిర్మిస్తూ ఉంటాడు. ఇతను అనధికారిక లెక్కల ప్రకారం ఒక సంవత్సరం 700 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని దగ్గర మార్కెట్ లో ఉన్న అన్ని రకాల పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి, బెంజ్, బి ఎమ్ డబ్ల్యు, రేంజ్ రోవర్ మొదలైనవి ఉన్నాయి. ఇలా ఇంకా ఎంతోమంది హీరోయిన్లు ధనవంతులైన వారిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు.