బుట్టలో మామిడి పళ్ళు పంపుతున్న బుట్ట బొమ్మ.. ఎవరికంటే?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పూజా హెగ్డే కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది పూజా హిగ్డే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన పూజా హెగ్డే బిజీబిజీగా గడుపుతోంది.

 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అలా వైకుంఠపురం లో సినిమాలో బుట్ట బొమ్మ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ పాటతో పూజా హెగ్డే కాస్త టాలీవుడ్ బుట్ట బొమ్మ గా మారిపోయింది.  కేవలం సినిమాల ద్వారానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా పూజా హెగ్డే ఇక ఇటీవల ఇండస్ట్రీలోని కొంత మంది తన స్నేహితులకు బుట్ట నిండా మామిడి పళ్ళు పంపుతున్నట్లు తెలుస్తోంది.

 కర్ణాటకలోని మంగళూరు వద్ద పూజా హెగ్డే కు ఒక పెద్ద మామిడి తోట ఉంది. అయితే ఈ ఏడాది మామిడి దిగుబడి ఎక్కువగా రావడంతో ఇక ఎంతో మంది టాలీవుడ్ లో ఉన్న స్నేహితులకు మామిడి పళ్ళు పంపుతుందట  బుట్ట బొమ్మ. ఇక పూజా హెగ్డే పంపిన మామిడి పండ్లు తొలిరోజున ఇద్దరు ముగ్గురు నిర్మాతలు దర్శకులు కూడా అందినట్లు తెలుస్తోంది అయితే ఇక ఈ బుట్ట బొమ్మ పంపిన గిఫ్టులు అందుకోవాల్సిన వారు ఇంకా చాలామంది ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: