సాయి పల్లవి అలా చేసిందంటే నమ్మచ్చా ?

Divya

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ ఒకే లాగానే ఆలోచిస్తూ ఉంటారు. తనకు స్టార్డం ఉండగానే ఎంతో కొంత సంపాదన వెనకేసుకోవాలి అనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే స్టార్డం పడిపోయిన తరువాత వాళ్లను పట్టించుకునే వాళ్లు కూడా ఉండరు. ఇందుకు కారణం ఏ ఒక్కరూ, ఎక్కువ కాలం ఒకే స్థాయిలో ఉండలేరు కాబట్టి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా స్టార్డం ఉన్నప్పుడే కొంత ఆస్తి వెనుక వేసుకుంటే మంచిది అన్నట్టు ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత వయసు మీదపడుతున్న కొద్దీ వారి వయస్సు కు  తగ్గట్టుగా పాత్రలు వేయవలసి ఉంటుంది. అందుకే ఇండస్ట్రీ లో వారు ఫామ్ లో ఉన్నప్పుడే కొంత డబ్బును వెనకేసుకోవాలనుకుంటారు. ఇక ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే చేస్తుందంటున్నారు.

ఇక తన రెమ్యూనరేషన్ పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. అది ఎలా బయటకు వచ్చింది అంటే.. పవన్ కళ్యాణ్ నటించబోతున్న "అయ్యప్పయుమ్ కోషియమ్ " రీమేక్ కోసం సాయి పల్లవిని  ముందుగా అడగగా, ఆ సినిమా కోసం ఏకంగా తను రూ. 3 కోట్ల ను డిమాండ్ చేసిందని టాక్. అందుకే అంత ఇచ్చుకోలేక నిర్మాతలు నిత్యా మీనన్ తో ముందుకు వెళ్తున్నారు.
అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని , ఆ సినిమాలో తన పాత్రను కొంచెం పెంచమని దర్శకనిర్మాతలను  అడగగా, దానికి ఆ దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదు. అందుకే తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి అయ్యప్పయుమ్ కోషియమ్  సినిమా , హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. ఏదో హీరోయిన్ ఉండాలంటే ఉండాలి అంతే..!  కానీ హీరోయిన్  పాత్రకు ఈ కథలో  పెద్దగా  స్కోప్ లేదు. అలాంటప్పుడు మూడు కోట్ల రూపాయలను  సాయిపల్లవికి ఇచ్చి ఎంచుకోవడం ఎందుకు అని నిర్మాతలు భావించారు. అందుకే ఈ సినిమాలో సాయి పల్లవిని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. సాగర్ చంద్ర దర్శకుడు. ఈ సినిమాని రీమేక్ చేయడంలో మొదట చాలా పేర్లు వినిపించాయి. కాకపోతే స్క్రిప్ట్ పనులన్నీ  దర్శకుడే పూర్తి చేసి, షూటింగ్ మొదలు పెట్టాడు. కరోనా కారణంగా షూటింగ్ మొత్తం ఆగిపోయింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న ట్లు వినికిడి. ఇందులో మరో హీరో రానా నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో చూ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: