నాకు బెల్లంకొండే స్టార్..కథే సినిమాకి హీరో.!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ దర్శకుల్లో పరిచయం అక్కర్లేని పేరు తేజ. చిత్రం, జయం, నువ్వు నేను లాంటి సినిమాలతో తేజ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. కెమెరామెన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి దర్శకుడిగా తేజ స్థిరపడ్డారు. అయితే కొన్ని సినిమాల తరవాత తేజ ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ రానా హీరోగా నటించిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. పొలిట‌క‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరవాత సీత అనే మరో సినిమా తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక సినిమా షూటింగ్ సమయం లో తేజ ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారని అవసరమైతే కొట్టి చెబుతారని పలువురు నటీనటులు చెపుతుంటారు. ఇక ఆయన ఇంటర్వ్యూలలోనూ ముక్కుసూటిగా మాట్లాడుతూ మనసులో ఉన్నది చెపుతారు. కాగా తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

ఇంటర్వ్యూలో   యాంకర్ మీరు స్టార్ హీరోలతో ఎప్పుడు సినిమాలు చేస్తారని ప్రశ్నించగా బెల్లంకొండ శ్రీనివాస్ తో సీత చేశానని చెప్పారు. రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశానని అన్నారు. వాళ్ళు స్టార్ హీరోలేనని సినిమాలో కథే హీరో అని అన్నారు. అంతే కాకుండా కథ భాగా లేకుండా స్టార్ హీరోతో సినిమా తీసినా అది హిట్ అవ్వదని కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా  ప్రస్తుతం తేజ "చిత్రం" సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా చేసారు. అంతే కాకుండా ఈ సినిమాతో ఆయన కొడుకునే హీరోగా పరిచయం చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా తో కొత్త నటీనటులను కూడా పరిచయం చేయబోతున్నారు. ఇదిలా ఉండగానే దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను కూడా తేజ లాంచ్ చేయబోతునట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: