20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి
అయితే జాహ్నవి వివాహం చేసున్నట్లు తెలుస్తుంది. ఆమె భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కావడం విశేషం. ఇంతకీ ఆమె భర్త మరెవరో కాదు రసూల్ ఎల్లోర్ జల్సా, మని మని, గాయం, నువ్వు నేను వంటి సినిమాలకు అయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. ఇందులో భాగంగా గాయం సినిమాతో అయన బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డ్స్ ని అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. దర్శకుడిగా 'ఒకరికి ఒకరు' అనే సినిమా చేసారు. అటు తర్వాత భగీరథ, సంగమం అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో కూడా భగీరథకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నంది అవార్డును కూడా అందుకున్నారు.
అయితే రసూల్ ఎల్లోర్ జాహ్నవి కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవారు కావడం విశేషం. ప్రస్తుతం జాహ్నవి సినిమాలకి దూరంగా ఉండగా, ఆమె నటి నుంచి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు. కిందటి ఏడాదే అడవి శేష్ హీరోగా చేసిన చిత్రమైన 'ఎవరు' సినిమాకి జాహ్నవి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసారు.