జాతి రత్నాల దెబ్బకి ఏ1 ఎక్స్ప్రెస్ క్లోస్ అయిపోయింది...

NIKHIL VINAY
మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న జాతిరత్నాలు సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.ఈ సినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొడుతోంది. మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు.
ఈ సినిమా  పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకుంది అని టాక్. అయితే ఈ సినిమా విడుదల అవ్వడం వల్ల ఇంకో సినిమాకి దెబ్బ పడింది. అదే సందీప్ కిషన్  కొత్త సినిమా ఏ వన్ ఎక్స్ప్రెస్. తమిళంలో హిట్టయిన నాట్ప్ తునై   సినిమాని తెలుగులోకి ఏ వన్ ఎక్స్ప్రెస్ గా రీమేక్ చేస్తున్నారు సందీప్ కిషన్. తమిళ్ లో లాగే తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సందీప్ ఆశించాడు.ఈ సినిమా బయట టాక్ ని చూస్తుంటే సందీప్ కిషన్ హిట్ కొట్టినట్టే ఉన్నారు అనుకున్నారు.  సందీప్ కిషన్ నటించిన ఈ మధ్య సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అని సినిమాలో హాకీ సీన్స్ చాలా బాగా ఉన్నాయి అని పబ్లిక్ టాక్ కూడా వచ్చింది.
.అయితే జాతిరత్నాలు సినిమా ఈ సినిమా తర్వాతి వీక్ లో విడుదలవ్వడంతో ఈ సినిమా కి కలెక్షన్స్ అన్ని పడిపోయాయి. చివరికి లాభాల వరకు కూడా రాలేకపోయింది. ఈ సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ 4.50 కోట్లు వచ్చాయి. ఈ సినిమాని 6 కోట్లకి అమ్మేరు. అదే జాతిరత్నాలు విడుదల కాకపోయే ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: