ఈవారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాలీవుడ్ మూవీ!!!

kalpana
ఎనర్జిటిక్ హీరో కార్తికేయ అందాల భామ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించిన 'చావు కబురు చల్లగా'మూవీని గీత ఆర్ట్స్‌ బ్యానర్‌ లో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. వాస్తవానికి టీజర్, ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై బారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. హీరోహీరోయిన్లు డీ గ్లామర్ లుక్ చూస్తుంటే ఈ సినిమా మంచి కథతో తెరకెక్కినట్లుగానే అర్థమవుతుంది. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో హిరో కార్తికేయ సందడి చేయనుండగా, మల్లిక పాత్రలో లావణ్య త్రిపాఠి సందడి చేసింది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్రంలోని మై నేమ్ ఈజ్ రాజు అనే పాట మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ ఈ మధ్య వరుస చిత్రాలతో దూసుకుపోతు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఈ హీరోకి అదృష్టం ఏ రేంజ్‌లో ఉందంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌ పై కార్తికేయ హీరోగా సినిమాను నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి విషయానికొస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై "భలే భలే మగాడివోయ్‌', 'శ్రీరస్తు శుభమస్తు' ప్రస్తుతం మూడో చిత్రంగా 'చావు కబురు చల్లగా' మూవీలో నటిస్తోంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పవర్ ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించినట్లు అర్థమవుతుంది. సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకే మనం చూసినా శుభలగ్నం వంటి మూవీ లో ఆమె ఎంత అద్భుతంగా నటించిందో మనందరికీ తెలుసు. ఇక ఈ మూవీలో మురశీ శర్మ, రజిత, భద్రం, మహేష్‌, ప్రభు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: