ఈవారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాలీవుడ్ మూవీ!!!
ఆర్ఎక్స్100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన హీరో కార్తికేయ ఈ మధ్య వరుస చిత్రాలతో దూసుకుపోతు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఈ హీరోకి అదృష్టం ఏ రేంజ్లో ఉందంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కార్తికేయ హీరోగా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. నవంబర్లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి విషయానికొస్తే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై "భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' ప్రస్తుతం మూడో చిత్రంగా 'చావు కబురు చల్లగా' మూవీలో నటిస్తోంది. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పవర్ ఫుల్ పాత్రలో అద్భుతంగా నటించినట్లు అర్థమవుతుంది. సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకే మనం చూసినా శుభలగ్నం వంటి మూవీ లో ఆమె ఎంత అద్భుతంగా నటించిందో మనందరికీ తెలుసు. ఇక ఈ మూవీలో మురశీ శర్మ, రజిత, భద్రం, మహేష్, ప్రభు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇంతటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.