సోమవారం చల్లబడిన జాతిరత్నాలు వేడి

NIKHIL VINAY
ప్రస్తుతం ఎక్కడ విన్న కూడా ‘జాతి రత్నాలు’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. రెండు గంటలు ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.   మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల అయ్యింది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో విడుదలై.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొడుతోంది. మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమా ఈరోజు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకుంది అని టాక్. ఇక ఈరోజు నుంచి ఈ సినిమాకి అన్ని లాభాలే. ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు.  ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ లో తమిళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా విజయ్ మాస్టర్ సినిమాని 3 రోజాల్లో క్రాస్ చేయడం విశేషం.ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయింది.అయితే వరసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కొట్టిన జాతి రత్నాలు సినిమా 15తేదీ సోమవారం మాత్రం సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది అని అంటున్నారు ట్రేడ్.ఈ సినిమాకి మళ్ళీ వచ్చే వీకెండ్ వరకు ఆవేరేజ్ కలెక్షన్స్ తప్పవు అని ట్రేడ్ అంటుంది. ఇక నవీన్ పొలిశెట్టి కి ఈ వరస హిట్స్ రావడంతో ఆయన రేంజ్ మెల్లగా పెరుగుతుంది. నవీన్ తర్వాత సినిమా ఏది ఎంచుకుంటాడో అని ఇండస్ట్రీ ఆసక్తి గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: