రణవీర్ సింగ్ కి సౌత్ కలిసొస్తుందా ??

NIKHIL VINAY
బాలీవుడ్ లో రణవీర్ సింగ్ ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోలలో చాలా ముంద ఉన్నారు .ఆయన ఈ మధ్య తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులోనూ ఎన్టీఆర్ టెంపర్ సినిమా హిందీ రీమేక్ సింబ  మరియు గల్లీ బాయ్ సినిమాలు దాదాపుగా 200 కోట్ల పైగా కలక్షన్స్ సంపాదించాయి. దాంతో ఆయన సినిమాలంటే నిర్మాతలు క్యూ కడుతున్నారు . అలాగే సినిమాల ఎంపిక విషయంలో రణవీర్ సింగ్ చాలా జాగ్రత్తగా ఉంటారు .ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా 83 సినిమా ప్రముఖ క్రికెటర్ మన దేశానికి మొదటి సారి వరల్డ్ కప్ తీసుకువచ్చిన కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్.  ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం రణవీర్ సింగ్ బిజీగా ఉన్నారు. ఇక ఈ రోజే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మూవీ టీం. ఈ సంవత్సరం జూన్ 4న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాతో రణవీర్ సింగ్ సౌత్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ 83 సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతుంది .ఇప్పటిదాకా హిందీ సినిమాల్లో కోట్లు కొల్లగొట్టిన రణవీర్ సింగ్ ఇప్పుడు సౌత్ మార్కెట్ మీద కన్నేశాడు. ఈ సినిమా సౌత్ లో విడుదల ఎందుకంటే క్రికెటర్ కపిల్ దేవ్ గురించి దేశమంతటా అందరికీ తెలుసు. దాంతో ఇది సినిమా మార్కెట్ కి కూడా బాగా ఉపయోగపడుతుందని ఈ సినిమాని సౌత్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ తో పాటు చాలామంది ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు .అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాని రణవీర్ సింగ్ భార్య అలాగే ప్రముఖ నటి దీపికా పడుకొనే కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇక ఈ సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో విడుదల వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: