గుర్తు పట్టకుండా మారిపోయిన చందమామ హీరోయిన్ సింధు మీనన్
అలా 1994 లో జయరాం డైరెక్షన్ లో వచ్చిన రాశ్మీ అనే కన్నడ సినిమా ద్వారా బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సింధు మీనన్, 1999 లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించారు. 2001 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఇన్స్పెక్టర్, ఆడంతే అదో టైపు, చందమామ, రెయిన్ బో, సిద్ధం, ప్రేమ పిలుస్తోంది, సుభద్ర సినిమాల్లో నటించారు. చందమామ, వైశాలి సినిమాలతో ఈమెకు మంచి పేరు వచ్చింది. వైశాలి సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. మలయాళంలో వంశం అనే సీరియల్ లో కూడా నటించారు. పలు టివి షోస్ కి హోస్ట్ గా కూడా చేశారు. 2010 ఏప్రిల్ లో యుకెలో నివసించే ఐటీ ప్రొఫెషనల్ డొమినిక్ ప్రభును వివాహం చేసుకుని హౌజ్ వైఫ్ గా సెటిల్ అయ్యారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫ్యామిలికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.