లావణ్య త్రిపాఠిపై కార్తికేయ అలక ....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... నేడు డిసెంబర్ 15 లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, ఫ్యాన్స్ చాలా విధాలుగా పెద్ద ఎత్తున  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం యువ నటుడు కార్తికేయ తో చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తుంది. ఈ నేపథ్యంలో లావణ్య పుట్టిన రోజు కానుకగా ఆమె స్పెషల్ లుక్ రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది  చిత్రయూనిట్. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ  హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన 'మల్లిక' పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
ఇక  'చావు కబురు చల్లగా' చిత్రయూనిట్ వదిలిన లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన కార్తికేయ.. లావణ్యపై అలకపాన్పు వేస్తూనే కాస్త స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ''మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా..! చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని పట్టుకొస్తా.. అల్లాడించేద్దాం అంతే'' అంటూ కామెంట్ చేశాడు. అంటే.. సాయంత్రం పార్టీ గ్రాండ్‌గా చేసుకొని చిల్ అవుదాం అన్నట్లుగా కార్తికేయ చెప్పిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో ఈ సోషల్ మీడియా పోస్ట్  నెట్టింట వైరల్‌గా మారింది."ఆర్ ఎక్స్ 100" సినిమాతో కార్తికేయ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాలో ఇతని నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: