ఆ ఇద్దరూ ఒకే సినిమాలో అంటే రచ్చ మాములుగా లేదుగా..!!

Chaganti

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఇప్పుడు ఇద్దరు కన్నడ భామలు ఏలుతున్నారు. అందులో ఒకరు మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే కాగా మరొకరు ప్రాంతానికి చెందిన రష్మిక మందన్న. ప్రస్తుతానికి ఈ ఇద్దరే స్టార్ హీరోల సినిమాలను పంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏమీ లేదు ఎందుకంటే వీరిద్దరూ కలిసి నటించెడి ఒక స్టార్ సరసన అనుకునేరు. 


కాదు ఒక కుర్ర హీరో సరసమా అంటే. ఆయన మలయాళం ఒక స్టార్ హీరో కొడుకు అక్కడ ఆయనకు భారీగానే క్రేజ్ ఉంది కానీ తెలుగులో మాత్రం ఆయన చేసింది ఒక్క సినిమానే అది కూడా ఒక నెగిటివ్ పాత్ర లో. ఆయన మరెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్ర పోషించి తెలుగు వాళ్ళందరికీ విలన్ గా ముద్రపడిన ఆయన ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. కృష్ణ గాడి వీర ప్రేమ కథ పడి పడి లేచే మనసు లవ్ స్టోరీ లు తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. 



స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వినీ దత్ కూతుర్లు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారట. అందుతున్న సమాచారం మేరకు ఈ ఇద్దరు హీరోయిన్ల కోసం రష్మిక, పూజ హెగ్డేలను సంప్రదించారని అంటున్నారు. వీళ్లిద్దరూ కూడా కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. నిజానిజాలు అధికారిక ప్రకటన వస్తే గానీ ఏమీ చెప్పలేం మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: