శింబు చేతిలో మోసకపోయిన టాప్ హీరోయిన్ కూతురు

E. Rama Krishna
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్స్ తో రిలేషన్ ని మెయింటెన్ చేసే హీరోగా శింబుకి మంచి పేరుంది. శింబుతో టాప్ హీరోయిన్స్ నుండి బడా ప్రొడ్యూజర్స్ కూతుర్లు వరకూ పరిచయాలు బలంగా ఉంటాయని కోలీవుడ్ ఓపెన్ టాక్. ఇదిలా ఉంటే తాజాగా టాప్ హీరోయిన్ కూతురు శింబు మాటలకు మోసకపోయిందనే కథనాలు వినిపిస్తున్నాయి. సినీ స్టార్స్ రాధిక, శరత్ కుమార్‌ల గారాల పట్టి వరలక్ష్మి కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ''పోడాపోడీ'' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన ఈ భామ శింబుతో ఎఫైర్ ని నడింపిందని ఆ మధ్య బలంగా వార్తలు వినిపించాయి. అయితే అందుకు వరలక్ష్మీ ఆ వార్తలు అన్నీ అవాస్తవం అని చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం వరలక్ష్మీ శింబుపై కోపంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. తనతో మరో సారి నటించే అవకాశం ఇస్తానని వరలక్ష్మీకి శింబు మాట ఇచ్చాడంట. అందకే వీరిద్దరూ కలిసి నటించిన మూవీ పోడాపోడీ అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ, శింబుతో మరోసారి నటించే అవకాశం ఉందనే ఆశతో వరలక్ష్మీ ఎదురు చూస్తుంది. ఇప్పుడు శింబు, వరలక్ష్మీ తో ఇక నటించే అవసరం లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడట. దీంతో వరలక్ష్మీ , శింబుపై పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మరో స్టార్ హీరోయిన్ శింబు చేతిలో మోసకపోయిందనే న్యూస్ కోలీవుడ్ లో మీడియా హైలెట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: