ధూమ్4 లో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ‘ధూమ్’ సిరీస్ కు ఎంత మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ఎ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని లేదు.. ఈ సీక్వెల్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. ఇక హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 అయితే.. మంచి హిట్ అయ్యి తెలుగులో కూడా హృతిక్ రోషన్ కి మంచి మార్కెట్ ని తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం అందరి చూపు ‘ధూమ్4’ పైనే ఉంది. మొదట సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టులో నటిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది.కానీ కారణాలేంటో తెలీదు కానీ..ఆయన ఈ ప్రాజెక్టు పై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు ‘ధూమ్4’ ను కచ్చితంగా రిచ్ గా తెరకెక్కించాల్సి ఉంది. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారు కూడా 600కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే బాలీవుడ్ ను మాత్రమే నమ్ముకుని అంత పెద్ద మొత్తం పెట్టడమనేది కరెక్ట్ కాదు. కచ్చితంగా ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలి. అందుకే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అయితేనే.. ఈ భారీ ప్రాజెక్టుకి కరెక్ట్ అని వారు భావిస్తున్నారట. నిజానికి ‘బాహుబలి'(సిరీస్) తరువాత వచ్చిన ‘సాహో’ పెద్ద హిట్టయితే కాదు.
కానీ బాలీవుడ్లో అది 125కోట్ల పైనే షేర్ ను వసూల్ చేసి రికార్డులు సృష్టించింది. ఇక వరల్డ్ వైడ్ గా 240కోట్ల వరకూ షేర్ ను వసూల్ చేసింది. ఆ చిత్రం ప్రభాస్ రేంజ్ ను మరింతగా పెంచింది.కాబట్టి ‘ధూమ్4’ ప్రభాస్ తోనే తెరకెక్కించాలని నిర్మాత ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. ‘బాహుబలి2’ విడుదలైనప్పటి నుండీ ఆదిత్య చోప్రా అదే పనిలో ఉన్నాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్ 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయితేనే కానీ.. ‘ధూమ్4’ ఓకే అవుతుందని చెప్పలేము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: